ఆంధ్రాలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బదిలీలపై బ్యాన్ ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు కేటగిరీలుగా ఉద్యోగుల బదిలీ ఉండనుంది. రిక్వెస్ట్ బదిలీలకు గరిష్టంగా రెండేళ్లు ఒకేచోట పనిచేసిన వారికి అవకాశం ఇవ్వనున్నారు.
2023 ఏప్రిల్ 30 నాటికి 5 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న వాళ్లు బదిలీలకు అర్హులుగా పేర్కొంది. ఐదేళ్లు ఒకే చోట పనిచేసిన వారికి బదిలీ తప్పనిసరి చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. టీచర్లతో పాటు పలు
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రాలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బదిలీలపై బ్యాన్ ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు కేటగిరీలుగా ఉద్యోగుల బదిలీ ఉండనుంది. రిక్వెస్ట్ బదిలీలకు గరిష్టంగా రెండేళ్లు ఒకేచోట పనిచేసిన వారికి అవకాశం ఇవ్వనున్నారు.
2023 ఏప్రిల్ 30 నాటికి 5 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న వాళ్లు బదిలీలకు అర్హులుగా పేర్కొంది. ఐదేళ్లు ఒకే చోట పనిచేసిన వారికి బదిలీ తప్పనిసరి చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. టీచర్లతో పాటు పలు ఇతర ఉద్యోగులకు విడిగా గైడ్ లైన్స్ జారీ చేసింది. ఈ నెల 22 నుంచి 31 వరకూ బదిలీలకు అవకాశం కల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.