రాహుల్ యాత్ర విజయవంతం కావాలంటూ మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మలను కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎంఎల్ఏ డాక్టర్ సీతక్క దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈ నెల 23 న తెలంగాణ లోకి రాహుల్ గాంధీ ప్రవేశిస్తున్నదాని , వారు చేపట్టిన పాదయాత్ర విజయవంతం కావాలని తల్లులను దర్శించుకోవడం జరిగిందని, దేశాన్ని ఐక్యం చెయ్యడమే రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర ఉద్దేశమని, గడిచిన 8యేండ్ల బిజెపి పాలనలో పేదల ప్రజలకు ఒరిగింది ఏమి లేదని, దేశాన్ని విచ్ఛిన్నం చెయ్యడమే లక్ష్యం గా నరేంద్ర మోడీ గారు కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెడుతూ పరిపాలన కొనసాగిస్తున్న బిజెపికి దేశ ప్రజలు బుద్ది చెప్పాలి అని తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదించాలని రాహుల్ గాంధీ గారి పాదయాత్ర కు మద్దతు గా తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద ఎత్తున తరలి రావాలని సీతక్క పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జాలపు అనంత రెడ్డి, మాజీ జెడ్పీటీసీ బోల్లు దేవేందర్, తాడ్వాయి సర్పంచ్ ఇరుప సునీల్, సహకార సంఘం చైర్మన్ పులి సంపత్ గౌడ్, ఎస్టీ సెల్ జిల్లా కార్యదర్శి పిరీల వెంకన్న,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు వావిలాల రాంబాబు, మాజీ ఎంపీటీసీ బత్తిని రాజు, తాడ్వాయి గ్రామ కమిటీ అధ్యక్షులు పాక రాజేందర్, సంఘం రాము,జగదీష్ పోషాలు,పూజారులు సొడ్డబోయిన వెంకన్న,రమేష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు
previous post