దేశాన్ని విచ్ఛిన్నం చెయ్యడమే బిజెపి లక్ష్యం అని, మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తున్న బిజెపి కి దేశ ప్రజలు బుద్ది చెప్పాలి అని, ఈ నెల 23 న రాహుల్ గాంధీ తెలంగాణ కు రాబోతున్నారని, దానికి ములుగు నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ జోడో యాత్ర కు సంఘీభావంగా పాదయాత్ర నిర్వహించిన సీతక్క కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో ములుగు జిల్లా కేంద్రములో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సన్నాహక సమావేశం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి ఆధ్వర్యములో నిర్వహించగా, ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సీతక్క మాట్లాడుతూ అక్టోబర్ 23 నుంచి తెలంగాణలో జరిగే కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర విజయవంతం కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కంకణ బద్ధులై పని చేయాలని, తెలంగాణలో ప్రతి గడప నుంచి ఈ యాత్రలో పాల్గొనే విధంగా పార్టీ శ్రేణులు చొరవ చూపాలని కోరారు.
బిజెపి పాలనలో దేశంలో పెరుగుతున్న రాజకీయ ఆర్థిక అసమానతలు తొలగించడం కోసమే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర చేపట్టారన్నారు. భారత్ జోడోయాత్ర దేశంలో చారిత్రాత్మకంగా సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుందన్నారు. మత, కుల విద్వేషాలు రెచ్చగొడుతూ ఆర్థిక సంపదను కొద్ది మందికే దోచిపెడుతున్న దేశంలోని కార్పొరేట్ పరిపాలనకు స్వస్తి పలకడానికే రాహుల్ యాత్ర చేపట్టారన్నారు.
ఈ యాత్ర ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ కోసం కాదని, దేశ జాతి ఐక్య నిర్మాణానికి చేస్తున్న యాత్ర భారత్ ఔన్నత్యాన్ని కాపాడటం కోసమేన్నారు. కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్, టిపిసిసి సభ్యులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లాడి రాం రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్,మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు, ఎండీ అయుభ్ ఖాన్,ఫిషర్ మెన్ జిల్లా అధ్యక్షులు కంబాల రవి తదితరులు పాల్గొన్నారు