హైదరాబాద్ లో బడా బడా వ్యక్తులకు అవసరమైన మద్యం అందుతూనే ఉంది. లాక్ డౌన్ ఉన్నా వారికి ఎలాంటి లోటూ జరగడం లేదు. జూబ్లీహిల్స్ లోని సీక్రెట్ అఫైర్స్ పబ్ పై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేయడంతో ఈ బండారం బయటపడింది.
లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా పబ్ నిర్వాహకులు మద్యం అమ్మకాలు చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. ఈ పబ్ నుంచి 15 లక్షల విలువ చేసే మద్యం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్ పోలీసులకు టాస్క్ ఫోర్స్ పోలీసులు అప్పగించారు.