అంబర్ పేట వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ కు ( రిజిస్ట్రేషన్ నెంబర్ 307/2009) నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మంగళవారం అంబర్ పేటలో జరిగిన అసోసియేషన్ సభ్యుల సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అంబర్ పేట వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎం.సతీష్ ముదిరాజ్, ఉపాధ్యక్షుడిగా బివి శేఖర్ చారి, ప్రధాన కార్యదర్శిగా డిఎస్. హన్స్ రాజ్ నాథ్, సంయుక్త కార్యదర్శిగా నూనె సతీష్ యాదవ్, కార్యనిర్వాహక కార్యదర్శిగా చింత బాలస్వామి, కోశాధికారిగా సయ్యద్ గౌస్ పాషా, కార్యవర్గ సభ్యుడిగా పి. కళ్యాణ్ బాబులను ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సతీష్ ముదిరాజ్, హన్స్ రాజ్ నాథ్, కోశాధికారి సయ్యద్ గౌస్ పాషాలు మాట్లాడుతూ అంబర్ పేట వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ కు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం సంతోషంగా ఉందన్నారు. త్వరలో అంబర్ పేట నియోజకవర్గంలోని సీనియర్, జూనియర్ జర్నలిస్టులతో కలిసి పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. నియోజకవర్గంలో పనిచేస్తున్న ప్రింట్ మీడియాకు చెందిన జర్నలిస్టులందరికీ అసోసియేషన్ లో సభ్యత్వం ఇస్తామని తెలిపారు. నియోజకవర్గంలోని జర్నలిస్టుల సంక్షేమం కోసం తమ అసోసియేషన్ పని చేస్తుందని వారు పేర్కొన్నారు. నియోజకవర్గంలోని పేదల ప్రజల కోసం అసోసియేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టనున్నట్లు వారు వెల్లడించారు.
సత్యం న్యూస్, అంబర్పేట్