ప్రైవేట్ రంగంలో 75% రిజర్వేషన్లు కల్పించాలన్న హర్యానా ప్రభుత్వ ఉత్తర్వుపై పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు గురువారం స్టే విధించింది. జస్టిస్ అజయ్ తివారీ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. రాష్ట్రానికి చెందిన యువకులకు పరిశ్రమల్లో 75 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టానికి వ్యతిరేకంగా పలు పిటిషన్లు దాఖలయ్యాయి. హర్యానా స్టేట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ లోకల్ అభ్యర్థుల చట్టం, 2020 ను ప్రభుత్వం ముందుగా నోటిఫై చేసింది. ఇది జనవరి 15, 2022 నుండి రూ. 30,000 కంటే తక్కువ నెలవారీ జీతం అందించే ప్రైవేట్ రంగ ఉద్యోగాల్లో స్థానిక యువతకు 75 శాతం రిజర్వేషన్ను కల్పించేందుకు నిర్దేశించింది. ఇది ప్రైవేట్ కంపెనీలకు వర్తిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్రంలోని సొసైటీలు, ట్రస్టులు, భాగస్వామ్య సంస్థలకు కూడా ఇది వర్తిస్తుంది. అయితే ఈ నోటిఫికేషన్ రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమని గుర్గావ్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ నోటిఫికేషన్ మెరిట్ అభ్యర్ధులకు ఉపాధి అవకాశాలను దక్కకుండా చేస్తుందని పిటిషన్ లో పేర్కాన్నారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ప్రభుత్వ నోటిఫికేషన్ పై స్టే విధించింది.
previous post