విశాఖపట్నం శ్రీ కనకమహాలక్ష్మి దేవస్థానం నూతనంగా ప్రవేశపెట్టిన సహస్ర తులసీదళ అర్చన సేవను విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి గురువారం ఉదయం ప్రారంభించారు. ఇకపై ప్రతి గురువారం శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి నిర్వహించే సహస్ర తులసీదళ అర్చనలో పాల్గొనే అవకాశం భక్తులకు కలుగుతుందని ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొల్లి సింహచలం తెలిపారు.