26.2 C
Hyderabad
May 10, 2024 22: 46 PM
Slider ముఖ్యంశాలు

ఈ నెల 30న కొల్లాపూర్ కు ప్రియాంకా గాంధీ

#Priyanka Gandhi

ఈనెల 30 వ తారీకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కొల్లాపూర్ నందు పాలమూరు ప్రజాగర్జన సభ నిర్వహిస్తున్నామని ఈ సభ కు ముఖ్య అతిథులు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హాజరవుతారని మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్ తెలిపారు.

ఎన్నికల శంఖారావం కొల్లాపూర్ నుండి ప్రారంభిస్తామని, ఈ సభలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, సీనియర్ రాజకీయవేత్త మెగా రెడ్డి, తదితర ముఖ్య నేతలు వివిధ ప్రాంతాలకు, జిల్లాలకు చెందిన ముఖ్య నాయకులు పార్టీలోకి చేరుతారని తెలిపారు.రెండు లక్షల మందితో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ఎన్నికల శంఖారావాన్ని కొల్లాపూర్ నుండి ప్రారంభిస్తామని సంపత్ కుమార్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిసిసి వైస్ ప్రెసిడెంట్ గిత్తల దేవరాజు, జిల్లా జనరల్ సెక్రెటరీలు హనుమన్న ,సాంబశివుడు ,జిల్లా ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు మద్దిలేటి ,డిసిసి స్పోక్ పర్సన్ మైనర్ బాబు ,జిల్లా బీసీ సెల్ ఉపాధ్యక్షులు పాండురంగ మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఉత్తనూరు జయన్న, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మాస్టర్ మధు ,నాయకులు ముఖ్యరన్న, బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు బసవరాజు ,రవీందర్, ఫిరోజ్ ,శాలి ,లక్ష్మన్న, రాజు ,మల్లికార్జున్ ,హనుమంతు,శంకర్ గౌడ్,దొడ్డప్ప ,ఉలిగన్న, తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

జ‘గన్’ హామీలపై రఘురామ గన్

Satyam NEWS

ప్రేమ పూజారినయ్యా..

Satyam NEWS

గూన్స్ ఎటాక్: బీజేపీ నేత పై కత్తులతో దాడి చేసిన వైసీపీ

Satyam NEWS

Leave a Comment