37.2 C
Hyderabad
April 26, 2024 22: 53 PM
Slider కడప

గూన్స్ ఎటాక్: బీజేపీ నేత పై కత్తులతో దాడి చేసిన వైసీపీ

rajampet attack

కడప జిల్లా రాజంపేట పట్టణం బీజేపీ యువనేత పట్టుపోగుల సూర్యచంద్ర పై వైసీపీ కార్యకర్తలు కత్తులతో దాడి చేశారు. ఆదివారం రాత్రి వైసీపీ గూండాల కత్తి దాడి కి గురైన బీజేపీ కార్యకర్త పట్టుపోగుల సూర్యచంద్ర పరిస్థితి అత్యంత విషమంగా వుంది.

దాడిచేసిన వైసీపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బీజేపీ నేతలు రాజంపేట డీఎస్పీ నారాయణ స్వామి రెడ్డి ని కలిసి వినతిపత్రం అందజేశారు. కడప జిల్లా రాజంపేట లో అధికార వైసీపీ నాయకుల ఆగడాలు రోజు రోజు కి మితిమీరుతున్నాయని, పరిస్థితి ఇలాగే కొనసాగీతే రాజంపేట పట్టణం లో శాంతి భద్రత లు కాపాడేందుకు ప్రజల భద్రత కోసం భారతీయ జనతా పార్టీ తగు ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తుందని వారు తెలిపారు.

సోమవారం రాష్ట్ర బీజేవైయం అధ్యక్షుడు నాగోతు రమేష్ నాయుడు, రాజంపేట అసెంబ్లీ కన్వీనర్ పోతూ గుంట రమేష్ నాయుడు తదితరులు డిఎస్పీ నారాయణ స్వామి రెడ్డి ని కలిసి వినతిపత్రం అందజేశారు. వైకాపా పార్టీ ఆగడాలను అన్ని స్థాయిల్లో ఆపాలని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో రాజంపేట పట్టణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మారాతూ వేంకట సుబ్బయ్య, జి .కే. నాగరాజు, బీజేపీ నాయకులు పి కృష్ణ యాదవ్, వై .సురేష్ రాజు, కంభాల శ్రీనివాసులు, బీజేవైయం రాష్ట్ర కార్యదర్శి అందిరాజు గుణవర్మ, జయసింహ రాజు, మండల ప్రధాన కార్యదర్శి యం. వేణుగోపాల నాయుడు, రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.     

Related posts

ఆప‌రేష‌న్ ప‌రివ‌ర్త‌న‌, దిశ యాప్ పై అవ‌గాహ‌న‌, త్రిబుల్ డ్రైవింగ్ ల‌పై ఝ‌ల‌క్

Satyam NEWS

తిరుపతిలో వినాయకచవితి సెలబ్రేషన్స్ పై ఆంక్షలు

Satyam NEWS

విజయనగరం జిల్లా అభివృద్ధిని వివరించిన కలెక్టర్ సూర్య కుమారి

Satyam NEWS

Leave a Comment