వనపర్తి జిల్లా పోలీస్ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని పలు ప్రాంతాల నుండి 09 మంది ఫిర్యాదు దారులు వచ్చారు. ఫిర్యాదు దారులతో జిల్లా అదనపు ఎస్పీ షాకీర్ హుస్సేన్ స్వయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత పోలీసు అధికారులకు ఫిర్యాదుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అదనపు ఎస్పీ ఆదేశించారు. 03 భూ ఫిర్యాదులు, 03 భార్యాభర్తల ఫిర్యాదులు, 03 పరస్పర గొడవల ఫిర్యాదులు వచ్చాయి. అదే విధంగా జిల్లా కలెక్టర్ బంగ్లా సెక్యూరిటీ కానిస్టేబుల్ పై వనపర్తికి చెందిన షేక్ బిక్కన్ పిర్యాదు చేశారు. దినపత్రికలు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారని తెలిపారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్