సైబర్ బెదిరింపులు మీకు ముప్పుగా పరిణమిస్తున్నాయా? అనే అంశంపై తెలంగాణ పోలీసు మహిళా భద్రతా విభాగం, హైదరాబాద్ లోని సింబయాసిస్ లా స్కూల్, లీగల్ ఎయిడ్ సెంటర్ సంయుక్తంగా ఆన్ లైన్ క్విజ్ నిర్వహిస్తున్నారు. CybHER campaign లో భాగంగా ఈ క్విజ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
సైబర్ బెదిరింపులు తదితర అంశాలపై ప్రజలకు ఎంత మేరకు సమాచారం ఉన్నది అనే అంశాన్ని అంచనా వేసేందుకు ఈ క్విజ్ నిర్దేశించారు. 23వ తేదీ సాయంత్రానికి ఈ క్విజ్ లో పాల్గొనడానికి 6,800 మంది రిజిస్టర్ చేసుకున్నారు. మరింత మంది ఈ ఆన్ లైన్ క్విజ్ లో పాల్గొనాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
ఈ ఆన్ లైన్ క్విజ్ లో పాలు పంచుకోవడానికి www.cybher.in కు తక్షణమే లాగ్ ఇన్ కావాలని వారు కోరారు. ఈ క్విజ్ లో పాల్గొన్న వారికి తెలంగాణ రాష్ట్ర పోలీసు నుంచి ఈ సర్టిఫికెట్ ను ప్రదానం చేస్తారు.