దమ్మాలపాటి కృష్ణారావు గారి ఆశీస్సులతో, శ్రీ శైలేంద్ర సినిమాస్ బ్యానర్ మీద గతంలో, పిల్ల జమీందార్, ద్రోణ, కళవర్ కింగ్, కోడిపుంజు, మిస్టర్ నూకయ్య వంటి సినిమాలను నిర్మించిన DSR, అశ్విన్ బాబుతో ఒక కొత్త చిత్రాన్ని నిర్మించబోతున్నారు.
అశ్విన్ బాబు తన కెరీర్ ప్రారంభం నుంచి విభిన్న కథా చిత్రాలను ఎంచుకుంటూ రాజు గారి గది సినిమా సిరీస్ తో ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న హీడింబ తో మరోసారి తన సత్తా చాటుకోబోతున్నారు.
ఇలా కంటెంట్ ఆధారిత చిత్రాల్లో నటిస్తున్న అశ్విని బాబు తదుపరి చిత్రం ఒక విభిన్న మైన స్టోరీ లైన్ తో,మెడికల్ థ్రిల్లర్ గా రూపొందుతుంది. ఈ చిత్రంతో ఎం.ఆర్.కృష్ణ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.
సురేష్ మూవీస్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ సహకారం తో తను వరుసగా, మంచి టేక్నికల్ వాల్యూస్ తో ఉన్న చిత్రాలు నిర్మించనున్నట్టు, ఒక ప్రకటనలో చిత్ర నిర్మాత DSR ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే తెలియచేస్తారు.
సాంకేతిక బృందం
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : ఎం.ఆర్.కృష్ణ
నిర్మాత : DSR
బ్యానర్ : శ్రీ శైలేంద్ర సినిమాస్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : తోట రమేష్
సహా నిర్మాతలు : చందు, వెంకట్.
ఫైట్స్ : రామ్ లక్ష్మణ్
మ్యూజిక్ : హరి గౌర
పీఆర్వో : సాయి సతీష్