తెలంగాణ సిద్దాంతకర్త, స్వయం పాలనా స్వప్నికుడు ప్రొపెసర్ జయశంకర్ తెలంగాణ చరిత్రలో చిరకాలం నిలిచి పోతారని మల్లాపూర్ కార్పోరేటర్ పన్నాల దేవందర్రెడ్డి అన్నారు. జయశంకర్ జయంతి వేడుకల సందర్భంగా మల్లాపూర్ వార్డు ఆఫీస్లో ప్రొపెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా దేవేంర్రెడ్డి మాట్లాడతూ ప్రొపెసర్ జయశంకర్ ఆశయాల సాధన దిశగా సిఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ పాలన కొనసాగతోందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందన్నారు. నీళ్ళు, నిధులు, నియామకాల నినాదంతో పోరాడిన జయశంకర్ ఆశయాలకు అనుగుణంగానే నియామకాలు చేపట్టడం జరుగుతోందన్నారు.
మన నీళ్లు నిధులు మనమే సాదింకోగలిగామన్నారు.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావకోసం జయశంకర్ తన జీవితాన్నే త్యాగం చేశారన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పల్లా కిరణ్కుమార్రెడ్డి, ప్రధానకార్యదర్శి తాండ వాసుదేవ్గౌడ్, బీసీ సెల్ అధ్యక్షులు సానాల రవి, టీఆర్ఎస్ నాయకులు తీగుళ్ల శ్రీనావాస్గౌడ్, అల్లాడి కృష్ణయాదవ్, భ్రాకర్రెడ్డి, పద్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.