రాజధానిపై ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటనకు వ్యతిరేకంగా నేడు అమరావతి ప్రాంత రైతులు ధర్నా ప్రారంభించారు. రాజధానిని మూడు ముక్కలుగా చేస్తానని ఆయన చెప్పడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిపాలన అంతా అమరావతి నుంచే జరగాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు మందడం గ్రామంలో రోడ్డు పై బైఠాయించారు. ఇది సచివాలయం వెళ్లే రహదారి కావటంతో భారీగా పోలీసులు మోహరించారు.
previous post
next post