30.7 C
Hyderabad
May 5, 2024 05: 38 AM
Slider ప్రత్యేకం

కొల్లాపూర్ ఎమ్మెల్యే రావాలి అంటూ..ఎర్రటి ఎండలో నిరసన

#kollapurmla

కొల్లాపూర్ నియోజక వర్గ కేంద్ర  పట్టణంలో  ఎస్సీ గర్ల్స్ హాస్టల్ లో విద్యార్థులకు కలుషిత నీరు తాగే నీరు గా మారిందనె విషయం గురువారం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడు మీసాల రాము నిరసన చేపట్టారు. శుక్రవారం ఉదయం 11:20 నిమిషాల నుండి ఎర్రటి ఎండలో కూర్చొని నిరసన తెలుపుతున్నారు. అయితే ఇది శాశ్వత పరిష్కారం కావాలని విద్యార్థులకు మినరల్ వాటర్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన చేస్తున్నారు. దీనికి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి వచ్చి హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.నిరసన చెబట్టి సాయంత్రం కావస్తోంది. ఎమ్మెల్యే లో చలనం రాలేదు ఇంతవరకు.స్థానిక తాహాసిల్దార్ పోలీసులు వచ్చి పరిశీలించి వెళ్లారు. కానీ ఎమ్మెల్యే మాత్రం రాలేదు.ఎమ్మెల్యే వచ్చే వరకు నిరసన సాగుతుందని ఆయన వచ్చి హామీ ఇస్తేనే నిరసన విరమిస్తామని మీసాల రాము డిమాండ్ చేస్తున్నారు.మేము చచ్చిపోతేనె ఎమ్మెల్యే వస్తారంటే దానికైనా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. కచ్చితంగా ఎమ్మెల్యే వచ్చే వరకు నిరసన చేస్తామని డిమాండ్ చేస్తున్నారు.

Related posts

తిరుపతి లో బ్రాహ్మణ సర్వసభ్య సమావేశం…!

Satyam NEWS

పిఆర్సి నివేదికలను దహనం చేసిన TUTF ఉపాధ్యాయులు

Satyam NEWS

ఓటరు జాబితా అభ్యంతరాలను వేగంగా పరిష్కరించాలి

Satyam NEWS

Leave a Comment