కొల్లాపూర్ నియోజక వర్గ కేంద్ర పట్టణంలో ఎస్సీ గర్ల్స్ హాస్టల్ లో విద్యార్థులకు కలుషిత నీరు తాగే నీరు గా మారిందనె విషయం గురువారం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడు మీసాల రాము నిరసన చేపట్టారు. శుక్రవారం ఉదయం 11:20 నిమిషాల నుండి ఎర్రటి ఎండలో కూర్చొని నిరసన తెలుపుతున్నారు. అయితే ఇది శాశ్వత పరిష్కారం కావాలని విద్యార్థులకు మినరల్ వాటర్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన చేస్తున్నారు. దీనికి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి వచ్చి హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.నిరసన చెబట్టి సాయంత్రం కావస్తోంది. ఎమ్మెల్యే లో చలనం రాలేదు ఇంతవరకు.స్థానిక తాహాసిల్దార్ పోలీసులు వచ్చి పరిశీలించి వెళ్లారు. కానీ ఎమ్మెల్యే మాత్రం రాలేదు.ఎమ్మెల్యే వచ్చే వరకు నిరసన సాగుతుందని ఆయన వచ్చి హామీ ఇస్తేనే నిరసన విరమిస్తామని మీసాల రాము డిమాండ్ చేస్తున్నారు.మేము చచ్చిపోతేనె ఎమ్మెల్యే వస్తారంటే దానికైనా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. కచ్చితంగా ఎమ్మెల్యే వచ్చే వరకు నిరసన చేస్తామని డిమాండ్ చేస్తున్నారు.
previous post