అమెరికాలో జరిగిన ఆఫ్రో అమెరికన్ ఫ్లాయిడ్ దారుణ హత్యకు నిరసనగా ప్రపంచ వ్యాప్తంగా కార్మిక సంఘాలు జరిపిన నిరసన కార్యక్రమాలలో భాగంగా ఏఐటీయూసీ నిర్మల్ జిల్లా కమిటీ భారీ ప్రదర్శన జరిపింది. మన దేశం లో కూడా జాతి వివక్షత పేరిట మైనారిటీలు, దళితులు పైన దాడులు జరుగుతున్నాయని వాటిని తక్షణమే ఆపాలని ప్రదర్శనకారులు డిమాండ్ చేశారు.
జాతి, కులం, మతం, ప్రాంతం పేరిట రాజకీయాలు మానాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ చారి, ఏఐటీయూసీ జిల్లా నాయకులు యల్ ఆర్ ఉపలి, జిల్లా ఉపాధ్యక్షులు జాదవ్ శంకర్ పాల్గొన్నారు.