29.7 C
Hyderabad
May 7, 2024 06: 08 AM
Slider నల్గొండ

రైతులకు ఏక మొత్తంగా ఋణమాఫీ చేయాలని బ్యాంకు ఎదుట ధర్నా

#protest

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండలం కేంద్రంలో గురువారం రైతు సంఘం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో యూనియన్ బ్యాంక్ ఎదుట ధర్నా నిర్వహించి బ్యాంకు మేనేజర్ కు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు భూక్యా పాండు నాయక్, మండల కార్యదర్శి యం.బాబు నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయలు ఋణమాఫీ చేయాలని, కౌలు రైతులకు ఋణాలు ఇవ్వాలని, రైతులకు క్రొత్త ఋణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ రెండోవ మారు అధికారంలోకి వచ్చినప్పుడు నాలుగు దఫాలుగా ఋణమాఫీ చేస్తానని చెప్పిన ప్రభుత్వం 25,000 వేల రూపాయలు ఒకమారు,50,000 వేల రూపాయలు రెండవ మారు చేసినా యాబై వేల రూపాయలు కొద్దిమందికి మాత్రమే లబ్ది చేకూరిందని,ఏక మొత్తంగా లక్ష రూపాయలు ఋణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మఠంపల్లి మండల సిపిఎం పార్టీ కార్యవర్గ సభ్యుడు సయ్యద్ రణమియా,మండల నాయకులు పెద్ద వెంకన్న,చల్లా లింగయ్య,బి.నవీన్ నాయక్,కందికూరి వేంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

జగన్ సాక్షిగానే విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం

Satyam NEWS

ఆకాశాన్ని అంటుతున్న కూరగాయల ధరలు

Satyam NEWS

హౌడీ మోడీ లో అసలు కీలకం ఇది

Satyam NEWS

Leave a Comment