31.2 C
Hyderabad
May 3, 2024 01: 11 AM
Slider కడప

అంతర్వేది రథం దగ్దం ఘటనపై రాజంపేటలో నిరసన

#RajampetProtest

అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో  జరిగిన రథం దగ్ధం ఘటనకు సంబంధించి రాష్ట్ర బిజెపి , జనసేన పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం కడప జిల్లా రాజంపేటలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్  కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు.

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన, బిజెపి పార్టీలు హిందూ సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలోని ఆర్ఎస్ రోడ్డు నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు నిరసనగా వెళ్లారు. అనంతరం కార్యాలయం ఎదుట అప్పటికే పెద్ద ఎత్తున చేరుకున్న హిందువులు , ప్రజాసంఘాల నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

సబ్ కలెక్టర్ కార్యాలయం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ  రాష్ట్రంలో హిందూ దేవాలయాల పై విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నాయని, దాడులను కట్టడి చేయటంలో ప్రభుత్వం విఫలమైందని, దాడులు చేసిన వారిపై ఎందుకు కఠినమైన చర్యలు తీసుకోలేక పోతున్నారని విమర్శించారు.

ఇది సరైన పద్ధతి కాదు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జరిగిన ఎన్నికల్లో హిందుల ఓట్లతో గెలిచిన విషయం మరచిపోవద్దని, ఇతర మతాలను ఒక విధంగా, హిందులను ఒక విధంగా చూడటం మానాలని కోరారు.

ప్రభుత్వ యంత్రాంగం  పద్ధతి మార్చుకోకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు  చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వంకాయలు బాబు, కుసుమకుమారి, కాకర్ల రాముడు, రమేష్ నాయుడు, కృష్ణ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

సమస్యలు సృష్టించం-పరిష్కరిస్తాం

Satyam NEWS

గ్యాన్ వాపీ శృంగార గౌరీ మాత ఆలయ వివాదం తో వారణాసిలో ఉద్రిక్తత

Satyam NEWS

సుప‌రిపాల‌న అందించ‌డ‌మే సీయం కేసీఆర్ ల‌క్ష్యం

Satyam NEWS

Leave a Comment