పదవ తరగతి పిల్లల కోసం ప్రారంభించిన ‘యూ ట్యూబ్ లైవ్’ తరగతులను ఉపయోగించుకోవాలని హుజూర్ నగర్ మండల విద్యాధికారి బి.సైదా నాయక్ కోరారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో గురువారం మధ్యాహ్నం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆయన పదవ తరగతి ప్రత్యేక తరగతుల రివ్యూ సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు మల్లెల ఉదయశ్రీ, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. ఆన్ లైన్ తరగతుల మీద పిల్లల అభిప్రాయాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సమావేశంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్ శ్రీనివాస రెడ్డి ,ప్రసన్న,మాతంగి ప్రభాకరరావు, దీనారాణి, శేషగిరి,సుజాత, అశ్విని, వసంతరావు, జనార్దన్ రెడ్డి, రవీందర్ రెడ్డి, సి ఆర్ పి సైదులు పాల్గొన్నారు.