కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కాంగ్రెస్ నాయకులు దినేశ్ గుండూరావు, రిజ్వాన్ అర్షద్, కె.సురేశ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీదర్ పాఠశాల దేశ ద్రోహం కేసుకు నిరసనగా వారు బెంగళూరులోని సీఎం యడియూరప్ప నివాసం వరకు ర్యాలీ చేపట్టారు. సిద్ధరామయ్య మాట్లాడుతూ విద్యార్థిని తల్లిని అరెస్టు చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు.
పోలీసు వ్యవస్థని బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగపరుస్తోందని ఆయన ఆరోపించారు. ర్యాలీకి భారీ సంఖ్యలో కార్యకర్తలు హాజరుకావడంతో శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.