భక్తులు ఏంటో ఆసక్తి గా ఎదురుచూసే అమర్నాథ్ యాత్ర జూన్ 23న ప్రారంభం కాబోతుంది. దక్షిణ కశ్మీరులోని హిమాలయాల్లో ఉన్న అమర్నాథ్ ఆలయాన్ని దర్శించుకోవడానికి 42 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుందని అధికారులు ప్రకటించారు. ఆగస్టు 3న ఈ యాత్ర ముగుస్తుంది.
అమర్నాథ్ యాత్ర కోసం రిజిస్ట్రేషన్లు ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవుతాయి. 13 కన్నా తక్కువ, 75 కన్నా ఎక్కువ వయసున్న వారిని యాత్రకు అనుమతించరు. గతేడాది అమర్నాథ్ యాత్ర 40 రోజులు మాత్రమే కొనసాగింది.కాగా భక్తుల కోరికలు తీర్చే దేవుడిగా అమరనాథుని హిమ లింగ దర్శనానికి వెళ్ళడానికి జనం క్యూ కట్టడం గమనార్హం.