శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో కరోనా మహమ్మారి ప్రబల కుండా ప్రత్యేక హోమం చేస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఆధ్వర్యంలోని అర్చక బృందం మహా సౌరం, త్రిచ, అరుణం మూడు ఉపనిషత్తులలో సూర్య నమస్కారాలు, మహా సౌర, అరుణ హోమం ప్రత్యేక పూజలు జరుపుతున్నారు.
జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఈ హోమాలకు ఎవరూ రావద్దని సహాయ కమిషనర్, కార్యనిర్వాహణాధికారి వి హరి సూర్య ప్రకాష్ తెలిపారు. అరుణ హోమం కార్యక్రమానికి ఇతరులకు ఎవరికీ అనుమతి లేదు. దేవాలయం అర్చకులు, వైదిక సిబ్బందికి మాత్రమే పాల్గొంటారు.