కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సర్వే ప్రకారం దేశంలో ఎక్కువ సౌండ్ పొల్యుషన్ హైదరాబాద్లోనే ఉందని తెలిపింది. దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో శబ్ద స్థాయిలపై చేసిన సర్వేల్లో హైదరాబాద్ టాప్లో నిలిచింది. ప్రధానంగా సిగ్నల్స్ దగ్గర శబ్ద కాలుష్యం ఎక్కువగా ఉన్నట్టు తేలింది.
సిటీలో ఎక్కువగా ప్యారడైజ్ సెంటర్లో ఈ సౌండ్ పొల్యుషన్ ఎక్కువగా వస్తున్నట్టు సర్వే వెల్లడించింది. 2018 చివరి వరకు అందుబాటులో ఉన్న గణాంకాల ఆధారంగా.. కాలుష్య మండలి ఈ సర్వే వివరాలను ప్రకటించిం ది. ఈ గణాంకాల ప్రకారం హైదరాబాద్లో శబ్దకాలుష్యం 79 డెసిబల్స్గా నమోదైంది.
ఆ తర్వాత చెన్నైలో పగటి పూట ధ్వనుల స్థాయి 67.8 డెసిబల్స్గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో సగటు శబ్ద స్థాయి 61 డెసిబల్స్గా ఉన్నట్టుసర్వేలో వెల్లడైంది.