వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మూడో మహాసభ వచె డిసెంబర్ 29,30,31 తేదీలలో జరుగనున్నాయని, ఈ సందర్భంగా ఖమ్మం కాలేజీ గ్రౌండ్స్ లో జరిగే 29న జరిగే బహిరంగ సభను జయప్రదం చేయవలసిందిగా వ్యవసాయ కార్మికులకు, ప్రజలకు, నాయకులకు కార్యకర్తలకు సిపిఎం ఖమ్మం జిల్లా కమిటీ సభ్యులు షేక్ బషీరుద్దీన్ పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా తిరుమలయపాలెంలోని గజ్జల వెంకటయ్య భవనంలో వేగినాటి వెంకట్రావు అధ్యక్షుడు జరిగిన సిపిఎం నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మూడో మహాసభలు ఖమ్మం నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో డిసెంబర్ 29 30 31న జరగబోతున్నాయని, ఈ మహాసభల సందర్భంగా డిసెంబర్ 29వ తారీఖున బహిరంగ సభను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలియజేశారు. ఈ బహిరంగ సభకు కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ హాజరు కానున్నట్లు తెలియజేశారు. ఈ బహిరంగ సభకు వ్యవసాయ కార్మికులు, ప్రజలు, నాయకులు కార్యకర్తలు, అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి కొమ్ము శ్రీను, నాయకులు అంగిరేకుల నరసయ్య, తుళ్లూరి నాగేశ్వరరావు, బింగి రమేష్, పద్మనాభుల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
previous post