40.2 C
Hyderabad
May 2, 2024 18: 37 PM
Slider మహబూబ్ నగర్

నారాయణ పేట జిల్లా మక్తల్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎంపిక

#pressclub

తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్( ఐజేయూ) ఆధ్వర్యంలో శుక్రవారం మక్తల్ పట్టణంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టి నూతన ప్రెస్ క్లబ్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పట్టణంలోని రోడ్డు భవనాల శాఖ అతిథిగృహంలో నిర్వహించిన టీయూడబ్ల్యూజే  (ఐజెయు) సర్వసభ్య సమావేశంలో ముందుగా జిల్లా నాయకులు యాదన్న, బి.శ్రీనివాసులు, నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు చేపట్టారు. అనంతరం అందరి అభిప్రాయం మేరకు ఏకగ్రీవంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు .ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా వి.అంజయ్య  ఎన్నికయ్యారు. అదేవిధంగా ఉపాధ్యక్షులుగా అబ్దుల్ కవి,ఎన్. రమేష్ రావు, ఎం .రవికుమార్, ప్రధాన కార్యదర్శిగా జి.రాము ఎన్నికవగా సహాయ కార్యదర్శులుగా ఎం. శ్రీనివాసులు ,అబ్దుల్ బారి ,వి.అశోక్ కుమార్, కోశాధికారిగా ఎం. శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. నూతన కమిటీ సభ్యులను జిల్లా నాయకులు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే నెలలో జరుగనున్న టి యు డబ్ల్యూ జె  నారాయణపేట జిల్లా తొలి మహాసభలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు వి.ప్రహ్లాద్ ,వి.రమేష్,వి ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

మేడారం తల్లులను సందర్శించుకున్న గండ్ర సత్తెన్న

Satyam NEWS

సమీర్ శర్మ కోసం కొత్త పోస్టు

Murali Krishna

సైకో కిల్లింగ్: ఇంటర్‌ విద్యార్థిని దారుణంగా హత్య చేశాడు

Satyam NEWS

Leave a Comment