ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పదవి త్వరలో పోతుందా? ఆ మధ్య ఆంధ్రప్రదేశ్ కు ఒక మహిళా సిఎం రావాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ పెట్టి సంచలనం సృష్టించిన పివిపి ఇప్పుడు మరో సంచలన వ్యాఖ్య చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన రేపిన ఈ సంచలనం ఇప్పుడు ఆయన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పదవి ఉండాలనుకుంటున్నారో పోవాలనుకుంటున్నారో అర్ధం కాకుండా ఉంది. ఆయన పెట్టిన ట్వీట్ సారాంశం చూస్తే తలతిరగటం ఖాయం.
1995లో ఎన్టీఆర్ కేజీహెచ్ లో అడుగుపెట్టాక ముఖ్యమంత్రి పదవి పోయిందట. ఆ తర్వాత కేజీహెచ్ లో మరే ముఖ్యమంత్రి అడుగుపెట్టలేదని పివిపి తెలిపారు. మళ్లీ ఇప్పుడు జనాల కోసం ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ అడుగుపెట్టారని పివీపీ చెప్పారు. జగన్ కు ప్రజా సంక్షేమమే ప్రధానమని, పదవి కాదని అన్నారు. గ్యాస్ లీక్ ఘటనలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించేందుకు కేజీహెచ్ ఆసుపత్రికి జగన్ వెళ్లిన సంగతి తెలిసిందే.