ఉల్లి పాయల ధరలు తగ్గుముఖం పట్టాయని సంతోష పడుతున్నారా? వద్దు తొందరపడి సంతోషపడవద్దు. ఇక నుంచి ఆలుగడ్డలు అంటే బంగాళాదుంపల ధరలు పండిపోబోతున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో బంగాళా దుంప ల రేటు ఆకాశం వైపునకు ఎగబాకుతున్నది. ఢిల్లీతో బాటు కోల్కతాలో కూడా బంగాళాదుంపల ధర ఇప్పుడు గత సంవత్సరం ఇదే నెలతో పోలిస్తే రెండు రెట్లు ఎక్కువగా అయింది.
ఢిల్లీలో హోల్ సేల్ మార్కెట్ లో బంగాళాదుంప ధర కిలోకు రూ .32 కాగా చాలా ప్రాంతాల్లో ఇది కిలోకు రూ.40 కి చేరుకుంది. పంజాబ్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లో భారీ వర్షపాతం అక్టోబర్ వరకు పంటను ప్రభావితం చేసింది. పంట ఆలస్యం కావడంతో బంగాళాదుంపలకు డిమాండ్ మార్కెట్లో పెరిగింది. దీంతో రోజూ ధర పెరుగుతుంది.