సూర్యాపేట జిల్లా రబ్బి అసోసియేషన్ అధ్యక్షుడు గెల్లి రవి ఆధ్వర్యంలో హుజుర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఆర్చిడ్స్ స్కూల్ నందు వ్యాయామ ఉపాధ్యాయులకు ఉచిత రబ్బి అవగాహనా సదస్సును నిర్వహించారు. అనంతరం వ్యాయామ ఉపాధ్యాయులకు రబ్బీ టీ షర్ట్ లను అందించారు.
ఈ కార్యక్రమంలో 50 మంది వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అధ్యక్షుడు గెల్లి రవి మాట్లాడుతూ త్వరలో హుజుర్ నగర్ నియోజకవర్గం లోని అన్ని పాఠశాలలో రబ్బీ క్రీడ నందు ఉచిత శిక్షణను ఇవ్వనున్నట్లు తెలిపారు.రాష్ట్ర స్థాయి రబ్బీ టోర్నమెంట్ లో గెలుపొందిన యు – 14 క్రీడాకారులకు షూస్,సర్టిఫికెట్లను లను అందజేసి అభినందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రబ్బీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కర్నాటి తరుణ్ రెడ్డి,నల్గొండ రబ్బీ కార్యదర్శి దాసరి పృథ్వి రాజ్,జిల్లా ఉపాధ్యక్షుడు మన్నెం సీతారామిరెడ్డి,తెరాస యువనాయకులు మన్నెం విక్కీ,శేషు, వినోద్,సుమన్,సుధా,తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్