ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి , పిసీసీ కార్యదర్శి పుడురి జితేందర్ రెడ్డి లు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గుండ్ల పోచంపల్లిలో ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలోజరిగిన బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. అలాగే వారితో పాటు నాచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మేడల మల్లికార్జున్ , హబ్సిగూడ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాలేరు జే నవీన్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మైనార్టీ చైర్మన్ అబ్దుల్ రషిధ్ (అషు), తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి వంజరి సంతోష కి కెసిఆర్ గులాబి కండువా కప్పి బిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఉప్పల్ నియోజకవర్గ బీఅర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మా రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రాగిడి లక్ష్మా రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ఉప్పల్ నియోజకవర్గంలో బీఅర్ఎస్ పార్టీ విజయానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.
సత్యంన్యూస్, మేడ్చల్ జిల్లా