40.2 C
Hyderabad
April 29, 2024 18: 57 PM
Slider శ్రీకాకుళం

రంగస్థల కళాకారుల సమాఖ్య అధ్యక్షునిగా చిట్టి వెంకటరావు

#srikakulam

రంగస్థల కళాకారుల సమాఖ్య  అధ్యక్షునిగా చిట్టి వెంకటరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం ఉదయం శ్రీకాకుళం జిల్లా స్థానిక సమాఖ్య కార్యాలయంలో జరిగిన సర్వ సభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఎన్నుకున్నారు. ఈ మేరకు కార్యనిర్వాహక అధ్యక్షులు పన్నాల నరసింహ మూర్తి నూతన కార్యవర్గ జాబితాను విడుదల చేశారు. ప్రధాన కార్యదర్శి గా బి. రామచంద్ర దేవ్, కోశాధికారిగా ఐ.రమణా రావు ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షత ను ఎల్.రామలింగస్వామి చేపట్టగా, గౌరవ సలహదారులుగా పి ఎం.జె.బాబు,కె. అప్పారావులూ.., ఆర్ధిక సలహాదారునిగా బి.ఏ.మోహనరావు, న్యాయ సలహాదారునిగా కె. చిన్ని కృష్ణనన్ బాధ్యతలు స్వీకరించారు. ఉపాధ్యక్షులు గా కలగ గణేష్,నిక్కు హరిసత్యన్నారాయన, పొట్నూరు వెంకటరావు లను నియమించారు.  సంయుక్త కార్యదర్శిలుగా మంథిని వాసుదేవాచారి, బి.ఎన్. భూషన్, పైడి సత్యం, ఆశాలతాఖాన్ లను ఎంపిక చేశారు. కార్యవర్గ సభ్యులు గా ఎల్.నందికేశ్వర రావు, బి ఎం ఎస్ పట్నాయక్, టి.హారనాధ్, జాడ ప్రసాదరావు, బగ్గం అప్పారావు, కె.ఎస్. శరత్ కుమార్, సొంగలి గణేష్, కె.శాంతా రావ్ లను నియమించారు. ఎంపిక కాబడిన నూతన కార్యవర్గాన్ని ఈ సందర్భంగా వివిధ కళాకారుల, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, కళాభిమానులు అభినందించారు.

Related posts

విజయనగరం జిల్లాలో 27 వరకు జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ పర్యటన…!

Satyam NEWS

జిందాల్ స్టీల్స్ షాప్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే గోపిరెడ్డి

Satyam NEWS

వైద్య రంగంలో సమూల మార్పులు

Bhavani

Leave a Comment