స్వాతంత్య్ర సమరయోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్పై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శలు గుప్పించారు. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే రాహుల్ గాంధీ చేసిన ఈ ప్రకటనకు మద్దతు ఇస్తున్నారా అని ఫడ్నవీస్ ప్రశ్నించారు. రాహుల్ గాంధీకి భారతదేశం, కాంగ్రెస్ చరిత్ర తెలియదన్నారు. సావర్కర్ బ్రిటిష్ వారి నుంచి స్టైఫండ్ తీసుకునేవారని, ఇది చారిత్రక సత్యమని రాహుల్ గాంధీ అన్నారు. రాహుల్ గాంధీ మళ్లీ వీర్ సావర్కర్ను అవమానించారని ఫడ్నవీస్ అన్నారు.
previous post