27.7 C
Hyderabad
May 7, 2024 07: 36 AM
Slider ఖమ్మం

మే 6న వరంగల్ లో రాహుల్ గాంధీ కిసాన్ పోరాట సభ

#madhuyashkigowd

మే 6న వరంగల్ పట్టణంలో కిసాన్ సంఘర్షణ పోరాట సభ జరగనుంది. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్యఅతిథిగా హాజరు అవుతున్నారని కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ తెలిపారు. ఖమ్మం లోని సంజీవరెడ్డి భవన్ లో నేడు ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడారు.

ఖమ్మం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గుండాగా మారి, కాంగ్రెస్ పార్టీ నేతలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని మధు యాష్కీ గౌడ్ తెలిపారు. మంత్రి వేధింపులు తట్టుకోలేక నగరంలో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిద్ర పోతున్నడా ? అని ఆయన ప్రశ్నించారు. రౌడీ మంత్రిని తక్షణమే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని మధు యాష్కీ గౌడ్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి అయిన తారక రామారావు అండ చూసుకుని స్థానిక మంత్రి అజయ్ కుమార్ రెచ్చి పోతున్నాడని ఆయన అన్నారు.

Related posts

బస్సు ప్రమాద ఘటనపై సీఎం దిగ్భ్రాంతి: రూ.2 లక్షల పరిహారం

Satyam NEWS

మెగాస్టార్ ను ఢీ కొట్టబోతున్న చాణక్య

Satyam NEWS

ఆశ వర్కర్ల సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించాలి

Satyam NEWS

Leave a Comment