రామాయణ కథాంశం ఆధారంగా భారతీయ రైల్వే కొత్త రైలును నడుపుతుంది, ఇది రాముడితో సంబంధం ఉన్న ప్రదేశాలకు యాత్రికులను తీసుకువెళుతుందని అధికారులు తెలిపారు.కొత్త రామాయణ సర్క్యూట్ రైలు మార్చి చివరి వారం నుండి ప్రారంభమవుతుంది. ఈ రైలు రామాయణానికి సంబంధించిన ఇతివృత్తాలు మరియు చిత్రాలతో చక్రాలపైన ఒక ఆలయము ఉన్నట్లు గా ప్రయాణికులకు అనుభూతిని ఇస్తుంది.రైలు బయటి మరియు లోపలి భాగంలో రామాయణం కథ ఆధారంగా భజనలు,గానం చేస్తారు.
రైల్వే బోర్డు చైర్మన్ వి.కె. యాదవ్ మాట్లాడుతూ, “ఈ రైలు ప్రజలను రామాయణానికి సంబంధించిన అన్ని ప్రదేశాలకు తీసుకెళుతుంది. ఈ రైలు యొక్క థీమ్ రామాయణం ఆధారంగా ఉంటుంది. రామాయణానికి సంబంధించిన చిత్రాలు, ఆలోచనలు మరియు కవితలు రైల్ లో లోపల బయట కోచ్ లలో ప్రదర్శించబడతాయి
వాటికి సంబంధించిన చిత్రాలు ,ఇతిహాసం ,సంగీతం కూడా లాంటి ప్రదర్శనలతో ప్రయాణికులనుఈ ఆకర్షిస్తాయి.గతం లో రైల్వే లార్డ్ రామ్ పేరిట ‘శ్రీ రామాయణ ఎక్స్ప్రెస్’ అనే ప్రత్యేక రైలును రైల్వే నడిపింది, ఇది గత ఏడాది నవంబర్లో తన సేవలను ప్రారంభించిందాని అయన తెలిపారు.