మెడిసిన్ లో సీట్ సాధించి వేయికలలతో డాక్టర్ కావాలనే తపనతో కళాశాల లో చేరి అనూహ్యం గా ఓ మర్డర్ కేసు లో జీవిత ఖైదు శిక్ష పడి జైలు కు వెళ్లి సత్ప్రవర్తనతో విడుదల అయ్యి తిరిగి మెడిసిన్ చదివి కోర్సు ను పూర్తి చేసి తన కళలను సాకారం చేసుకున్న ఓ యువకుడి విజయ గాఢ ఇది.వివరాల్లోకి వెళితే శుభాష్ పాటిల్ బెంగుళూర్ వద్ద గల అఫ్జల్పూర్ తాలూకాలోని కలభురాగి నివాసి.
ప్రేమ వ్యవహారం లో హత్య కేసులో చిక్కుకుని శిక్షను అనుభవించి బయటకు వచ్చి తన ఇంటర్న్ షిప్ పూర్తి చేసుకున్న సందర్భం గా ఒక ట్వీట్ చేసాడు.డాక్టర్ కావాలన్న నా కలను సాకారం చేసుకున్నాను, నేను 97 లో ఎంబిబిఎస్ లో చేరాను, కాని ’02 లో నేను ఒక హత్య కేసులో జైలు పాలయ్యాను.
నేను జైలు ఓపిడి లో పనిచేశాను; సత్ప్రవర్తన తో 2016 లో విడుదలైన తరువాత, ’19 లో ఎంబిబిఎస్ పూర్తి చేసాను. ఈ రోజు నేను ఇంటర్న్షిప్ పూర్తి చేశాను అంటూ బావోద్వేగామ్ గా ట్వీట్ చేయగా మున్నాబాయ్ అంటూ అతన్ని సరదాగా ఆటపట్టిస్తున్నారు కొందరు.కాగా జైలు లో ఉన్నప్పుడు మామూలు డిగ్రీ తో పాటు జర్నలిజం లో ఓపెన్ యూనివర్సిటీ ద్వారా పట్టా సంపాదించి చదువు ఫై తన ఆసక్తి చూపాడు సుభాష్ పాటిల్ .