ఎంతో అట్టహాసంగా వైఎస్సార్సీపీ ప్రారంభించిన సామాజిక న్యాయ భేరికి వర్షం అడ్డంకి అయ్యింది. మధ్యాహ్నం రెండు న్నరకు విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కందివలసకు చేరింది. అయితే అక్కడ నుంచీ జేడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు..స్వీకరించారు.
కుమిలి వద్ద భారీ బైక్ ర్యాలీతో…విజయనగరం మండలం జమ్మూ వద్ద ఆ పార్టీ నేత జమ్మూ శ్రీను ఆధ్వర్యంలో కొనసాగిన బైక్ ర్యాలీ నగరంలో ని దాసన్నపేట వరకు కొనసాగింది. అక్కడ నుంచీ ట్రాఫిక్ డీఎస్పీ మోహనరావు.. ఆ ర్యాలీ నీ సజావుగా న్యూపూర్ణ వరకు కొనసాగింది. అయితే మరికాసేపట్లో స్టేజ్ మీదకు..బీసీ మంత్రులు వస్తారనే సమయానికి భారీ వర్షం పడటం తో ఎక్కడివారు అక్కడే ఉండిపోవడంతో సామాజిక న్యాయ భేరి సభ కాస్త వర్షం కారణంగా అకస్మాత్తుగా నిలిచిపోయింది.
ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం