నిత్యం కార్యక్రమాల్లో బిజీగా ఉండే రాజకీయ నాయకులు అప్పుడప్పుడు రోడ్డుపై చిరు వ్యాపారులు అమ్మే వస్తువులు ఏదో ఒకటి సామాన్యుల మాదిరిగా వారితో ముచ్చటిస్తూ కొంటుంటారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ కవిత జగిత్యాల నుంచి హైదరాబాద్ వెళ్తుండగా నూకపల్లి గ్రామ శివారు వద్ద కాసేపు ఆగారు.
రోడ్డు పక్కన మొక్కజొన్న కంకులు కాలుస్తున్న ఓ మహిళ దగ్గరికెళ్లి కంకులు కొనుగోలు చేసి అక్కడే రుచి చూశారు. మొక్క జొన్న కంకులు అమ్మే ఆమెతో సరదాగా మట్లాడారు. ఆమెతో మాట్లాడిన క్షణాలను గుర్తుచేస్ ఎమోషనల్ ట్వీట్ చేశారు.