34.7 C
Hyderabad
May 5, 2024 02: 08 AM
Slider ఆదిలాబాద్

రైతు వేదికల నిర్మాణాలను వేగవంతం చేయండి

#NirmalCollector

నిర్మల్ జిల్లాలో చేపట్టిన రైతు వేదికల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాలో చేపట్టిన రైతు వేదికల నిర్మాణ పనుల పై సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.

మండల, గ్రామాల వారీగా నిర్మాణ పనుల పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన రైతు వేదికల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. జిల్లాకు మంజూరైన 79 రైతు వేదికల నిర్మాణాలను వేగవంతం చేసి దసరా నాటికీ వందశాతం పూర్తి చేయాలనీ సూచించారు.

సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనుల పురోగతిని ప్రతి రోజు పర్యవేక్షించాలని, ఇసుక, సిమెంట్, రాడ్ ఇతర సామాగ్రిని అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. రైతు వేదికల ప్రాంగణం సుందరంగా కనిపించేలా విభిన్న ఆకృతులకు ప్రాధాన్యతనిస్తూ పచ్చదనం కనిపించేలా విరివిగా మొక్కలు నాటాలన్నారు.

విధులలో నిర్లక్ష్యం వహిస్తే అధికారులు, సిబ్బంది పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, పంచాయతీ రాజ్ ఈఈ సుదర్శన్ రావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్, ఏడి లు వినయబాబు, వీణ, వ్యవసాయ శాఖ ఏవోలు, ఏఈఓలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

అమరావతి తరలింపుపై మరింత వేగంగా చర్యలు

Satyam NEWS

రేపు ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో భారీ శాంతి ర్యాలీ

Satyam NEWS

సమస్యల సుడిగుండంలో తెలంగాణ రైతాంగం

Satyam NEWS

Leave a Comment