శ్రీవాణి ట్రస్టు దాతల సౌకర్యార్థం 2020 సెప్టెంబరు నెలలో ప్రతి రోజు వంద (100) ఆన్లైన్ బ్రేక్ దర్శనం టికెట్ల కోటాను టిటిడి అందుబాటులో ఉంచింది. ఇందులో భాగంగా దాతలు శ్రీవాణి ట్రస్టు ద్వారా రూ.10 వేలు ఆన్లైన్లో లేదా తిరుమలలోని అదనపు ఈవో కార్యాలయంలో కరెంటు బుకింగ్ ద్వారా చెల్లించి ఉదయం బ్రేక్ దర్శనం టికెట్లు పొందవచ్చు.
సెప్టెంబరు 19న శ్రీవారి నవాహ్నిక వార్షిక బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం, సెప్టెంబరు 23న గరుడసేవ ఉన్న కారణంగా ఈ రెండు రోజుల పాటు టికెట్లను టిటిడి రద్దు చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దాతల విజ్ఞప్తి మేరకు జూలై 30 నుండి శ్రీవాణి ట్రస్టు ద్వారా రూ. 10 వేలు చెల్లించి టికెట్లు పొందిన దాతల దర్శన కాలాన్ని ప్రస్తుతం ఉన్న 6 నెలల కాల పరిమితిని సంవత్సరానికి టిటిడి పెంచిన విషయం విదితమే.