పౌరసత్వ సవరణ బిల్లు (క్యాబ్)కు వ్యతిరేకంగా ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ శాంతి ర్యాలీ, మానవహారం, ధర్నా కార్యక్రమం నిర్వహించాలని నరసరావుపేట ముస్లిం జెఏసీ నిర్ణయించింది. ఈ భారీ ర్యాలీలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యలు కావాలని ముస్లిం జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు.
గురువారం నరసరావుపేట ఈద్గా ఆవరణలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో పలువురు ముస్లిం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పౌరసత్వానికి విఘాతం కలిగిస్తున్న బిల్లును వెంటనే రద్దు చేయాలని,NRC CAB ను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలని కోరారు. ఈ ర్యాలీ లో లౌకికవాదులు ,ప్రజా స్వామ్య వాదులు, మానవతా వాదులు, అన్నివర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.