27.7 C
Hyderabad
April 30, 2024 08: 40 AM
Slider గుంటూరు

రేపు ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో భారీ శాంతి ర్యాలీ

nrt muslims

పౌరసత్వ సవరణ బిల్లు (క్యాబ్)కు వ్యతిరేకంగా ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ శాంతి ర్యాలీ, మానవహారం, ధర్నా కార్యక్రమం నిర్వహించాలని నరసరావుపేట ముస్లిం జెఏసీ నిర్ణయించింది. ఈ భారీ ర్యాలీలో  ప్రతి ఒక్కరూ భాగస్వామ్యలు కావాలని ముస్లిం జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు.

గురువారం నరసరావుపేట ఈద్గా ఆవరణలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో పలువురు ముస్లిం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పౌరసత్వానికి విఘాతం కలిగిస్తున్న బిల్లును వెంటనే రద్దు చేయాలని,NRC CAB ను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలని కోరారు. ఈ ర్యాలీ లో లౌకికవాదులు ,ప్రజా స్వామ్య వాదులు, మానవతా వాదులు, అన్నివర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

Related posts

శ‌ర్వానంద్‌ ‘మ‌హాస‌ముద్రం’ ఆగ‌స్ట్ 19న విడుద‌ల‌

Satyam NEWS

ఎటూ తేలని చంద్రబాబు కేసు: త్రిసభ్య ధర్మాసనానికి నివేదన

Satyam NEWS

ఉద్యోగాలు అడిగిన జనసేన నేతల అరెస్ట్…

Satyam NEWS

Leave a Comment