అన్నమయ్య జిల్లా ఒంటిమిట్ట మండలంలోని హరిత హోటల్ లో శనివారం నిర్వహించిన వాలంటిర్లకు వందనం కార్యక్రమంలో రాజంపేట ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జున్ రెడ్డి పాల్గొన్నారు.
ఒంటిమిట్ట మండలలో సచివాలయలలో సేవలు అందుస్తున్న వార్డ్ వాలంటీర్లందరికి సేవా మిత్రా, సేవ రత్న, సేవ వజ్ర పురస్కారాల ప్రధానం జరిగింది ఈ కార్యక్రమంకు రాజంపేట ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జున్ రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి పురస్కర గ్రహితలకు శాలువ కప్పి ప్రశంస పత్రాలు అందించారు.
ఎమ్మెల్ మేడా మాట్లాడుతూ జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక పరిపాలనను ఇంటి ముగింట లోకి తెచ్చారని అన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి మద్య వారధి వాలంటీర్ అని,నేడు మరో అడుగు ముందుకేసి ‘జగనన్న సురక్ష’ పేరిట మరో గొప్ప కార్యక్రమాన్ని మొదలుపెట్టినారని అన్నారు.
ఈ గొప్ప కార్యక్రమాన్ని ఒంటిమిట్ట మండలంలో ఉన్న అర్హులైన ప్రజలకు వాలంటరీలు ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలని అలాగే ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు