31.2 C
Hyderabad
May 3, 2024 01: 27 AM
Slider కరీంనగర్

మొక్కలు నాటిన రాజన్న సిరిసిల్లా జిల్లా ఎస్పీ

#RajannaSirsillaSP

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రాజన్న సిరిసిల్లా జిల్లా ఎస్ పి రాహుల్ హెగ్డే నేడు మొక్కలు నాటారు.

తన పుట్టినరోజును పురస్కరించుకొని ఎస్పీ కార్యాలయం ప్రాంగణంలో ఆయన మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. 

పచ్చదనం పెంచడం కోసం, వాతావరణ కాలుష్యం తగ్గించడం కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఈ సందర్భంగా ఎస్ పి పిలుపునిచ్చారు.

ఇంతటి మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్ కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

Related posts

Sale Diabetes Cures Home Remedies Herb For Blood Sugar How To Get Sugar Levels Down Fast

Bhavani

కొడాలి కుక్క: సునీల్ దియోధర్ సంచలన వ్యాఖ్యలు

Satyam NEWS

సమన్వయంతో మేడారం  జాతరను విజయవంతం చేయాలి

Satyam NEWS

Leave a Comment