ఆసియాలోనే అతిపెద్ద జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఫిబ్రవరి లో ప్రారంభo కానునందున జాతర కోసం ములుగు జిల్లా పోలీస్ శాఖ ఇప్పటినుండే ప్రణాళికతో ముందడుగు వేస్తుంది. లక్షలాది మంది భక్తులు జాతరకు తరలివస్తారు కనుక పోలీస్ బాలగాలతో పాటు స్థానిక యువత సహకారం ముఖ్యమని, మరి ముఖ్యంగా సమ్మక్క సారళమ్మ గద్దెల మీదకు తీసుకువచ్చు సమయంలో ఇతర ప్రదేశాలలో మేడారం పూజారుల సంఘం పెద్దలు యువత పాత్ర చాలా ముఖ్యమని పోలీస్ శాఖ తో కలిసి పని చేసి జాతరను విజయవంతం చేయాలనీ ములుగు జిల్లా ఎస్ పి గౌష్ అలం యువతను కోరారు. సానుకూలంగా స్పందించిన యువత పోలీస్ శాఖ తో కలిసి పనిచేయడం వారి అదృష్టంగా అభివర్ణిస్తూ తమ సహకారం ఎల్లప్పుడూ పోలీస్ శాఖకు అందిస్తూ జాతరను విజయవంతం అయ్యేలా పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో డి ఎస్ పి ములుగు రవీందర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కిరణ్, సి ఐ పస్రా శంకర్, ఎస్ ఐ తాడ్వాయి ఓంకార్ యాదవ్ అభ్యుదయ యూత్ ప్రెసిడెంట్ భోజరావు అనిల్, రమేష్ ఇతర సభ్యులు యువత పాల్గొన్నారు.
previous post