సాధారణంగా మార్కెట్లో ధరలు పెరిగినపుడు ఆ వస్తువులను అసెంబ్లీకి తెచ్చి ఎమ్మెల్యేలు నిరసన తెలుపుతారు. అలాగే తాము ప్రొటెస్ట్ చేయాలనుకున్న అంశాలను వారు వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో చర్చ జరుపుతారు. తాజాగా రాజస్థాన్ లో అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యే బిహారీ లాల్ మిడతలున్న తట్టను తలపై పెట్టుకొచ్చి వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మిడతల వల్ల రైతులకు ఏడు లక్షల హెక్టార్లలో పంటలకు నష్టం జరిగిందని మీడుతలను అరికట్టాల్సిందిగా కోరుతూ నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.
previous post