ప్రముఖ బాలీవుడ్ నటుడు రాజేష్ కన్నాఒకతరం సినీ ప్రేక్షకులకు సుపరిచితుడే. ఆయన 1969లో తీసిన ఆరాధన సినిమా నుంచి విజయాల పరంపర కొనసాగించి 1971 వరకూ అదే ట్రెండ్లో 15 సినిమాల్లో నటించి ప్రేక్షకుల మదిలో తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇంతవరకూ ఈ రికార్డును ఏ బాలీవుడ్ చెరపలేదంటే అతిశయోక్తి లేదు. ఆఖరి ఖత్ అనే సినిమాతో తన సినీ కెరీర్ ప్రారంభించిన రాజేష్ కన్నా అసలు పేరు జతిన్ ఖన్నా. ఈయన విజయాల పరంపరతో అప్పటి ప్రేక్షకులు పరవశించి పోయి ఆయనను ముద్దుగా కాక అనే పేరుతో పిలిచేవారు.
నేడు రాజేష్ కన్నా 78వ జయంతి. రాజేష్ కన్నా భార్య డింపుల్ కపాడియాతో నటించిన పలు చిత్రాలు రిలీజ్కు నోచుకోలేదన్న విషయం తెలుసా? అంటే తెలియదనే చెప్పాలి. వాటిని ఇక్కడ తెలుసుకుందాం.
1987లో రాజేష్ కన్నా భార్య డింపుల్ కపాడియా నటించిన జై శివ శంకర్ అనే సినిమా షూటింగ్ అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగింది. ఈ సినిమాలో రాజేష్ కన్నా, డింపుల మధ్య రోమాంటిక్ సీన్లను చిత్రీకరించారు. అప్పుడే సినీ కెరీర్లో అడుగిడిన చింకిపాండే, సంగీత బిజ్లానీ కూడా సినిమాలో నటించారు. కానీ ఈ చిత్రం విడుదలకు నోచుకోలేదు. ఇందులో మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే ప్రస్తుతం రాజేష్ కన్నా కూతురు ట్వింకిల్ కన్నా భర్త అక్షయ్ కుమార్ కూడా చింకిపాండే రోల్ కోసం ప్రయత్నించారట. కానీ రాజేష్ కన్నతో అప్పట్లో పరిచయం లేకపోవడంతో అక్షయ్ కుమార్ ఆయన్ను కలవలేకపోయారు.
కాగా ఈ సినిమా కోసం తొలుతగా నిర్మాత దర్శకులు వినోద్కన్నా, మిథున్ చక్రవర్తి, జాకీ ష్రాఫ్లు కూడా ఒప్పందం కుదుర్చుకున్నారట. కానీ అనంతరం రాజేష్ కన్నా, జితేంద్ర, చింకిపాండేలను ఆయా పాత్రలకు తీసుకున్నారట.
ఈ సినిమాకు పాటలు పాడే బాధ్యత కిషోర్ కుమార్కు అప్పగించగా ఆయన సినిమా ఒక నెల ముందు రిలీజ్ అవుతుందనగా మరణించారట. అందుకని జై శివ శంకర్ సినిమా పాటలన్నీ కిషోర్ కుమార్ కొడుకు అమిత్ కుమార్ ఆలపించారు. కానీ ఈ సినిమా నేటి వరకూ రిలీజ్ కాలేదు.