42.2 C
Hyderabad
April 26, 2024 18: 08 PM
Slider తెలంగాణ

బిస్కెట్లు కొనివ్వమంటే అసభ్యంగా ప్రవర్తించిన తాత

pragati nagar

చిన్నారులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని అనుమానంతో 50 సంవత్సరాలకు పైబడిన సురేష్ అనే వ్యక్తి కి దేహశుద్ధి చేశారు. కొత్తగూడెం పట్టణ పరిధిలోని ప్రగతి నగర్ ఏరియా లో ఈ సంఘటన జరిగింది. అక్కడ నివాసం ఉంటున్న అమ్మమ్మ గారి ఇంటికి ఇద్దరు కవల పిల్లలు వచ్చారు. సుమారు నాలుగైదు సంవత్సరాలు గల ఆ చిన్నారులు రోడ్డుపై వెళ్తున్న సురేష్ అనే వృద్ధుడు వద్దకు వచ్చి  తాత బిస్కెట్లు కొనుక్కోడానికి రెండు రూపాయలు ఇవ్వవా అంటూ అడిగారు. ఆ చిన్నారులకు బిస్కెట్లు కొనిచ్చిన సురేష్ అభం శుభం తెలియని ఆ చిన్నారులను ఇంట్లోకి తీసుకొని వెళ్ళాడు. ఇంటికి తీసుకువెళ్లిన అతడు ఇద్దరు చిన్నారులపై అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ ఘటన చూసిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దాంతో ఆ కుటుంబ సభ్యులు సురేష్ ను పక్కనే ఉన్న విద్యుత్ స్తంభానికి కట్టి దేహశుద్ధి చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Related posts

దుకాణాల ముందు జనాలు క్యూ కోసం గడులు ఏర్పాటు

Satyam NEWS

విజయనగరంలో ఘనంగా ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమం

Satyam NEWS

ఉషస్సుల ఉగాది

Satyam NEWS

Leave a Comment