కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చిరుధాన్యాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని భాగ్యలక్ష్మి మాట్లాడుతూ చిరుధాన్యాలు తీసుకోవడం వలన ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందన్నారు. రైతులు ఇతర పంటలతో పాటు చిరుధాన్యాలను కూడా విత్తలన్నారు.
కార్యక్రమంలో వేసా అధికారులతో పాటు ఎంపీపీ కవిత విజయ్, జడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఎంపీపీ లక్ష్మారెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు దేవేందర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ శపథం రెడ్డి, డివిజన్ వ్యవసాయ అధికారులు, మండల సహకార సంఘ అధ్యక్షులు, రైతులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.