38.2 C
Hyderabad
May 5, 2024 19: 23 PM
Slider వరంగల్

వీరపనేని రామదాసు విగ్రహావిష్కరణ చేసిన సీతక్క

#seetakka

నిత్యం పోరాటాలు చేస్తూ, నిజాం నిరంకుశ పాలనకు ఎదురొడ్డి నిలిచి, అత్యున్నత సేవా భావాలతో పీడిత, తాడిత ప్రజలకు అండగా నిలిచిన మహనీయుడు వీరపనేని రామదాసు అని ఏఐసీసీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు నియోజకవర్గ శాసన సభ్యురాలు సీతక్క అన్నారు.

ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రంలోని సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుడు, సీపీఎం పార్టీ సీనియర్ నాయకుడు స్వర్గీయ వీరపనేని రామదాసు- వెంకటసుబ్బమ్మ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసి వారి విగ్రహాలకు ఆమె పూలతో నివాళులు అర్పించారు. రామదాసు త్యాగాలను ప్రజలకు తెలుపుతూ, ప్రజలకు చైతన్యాన్ని నిలుపుతున్న రామదాసు కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

రామదాసు ఆశయ సాధనలో మనమందరం కృషి చేయాలని, నీతి, నిజాయితీతో సాటి మనిషికి సహాయం చేయాలని, రామదాసు బాటలో పయనించి ప్రజా పోరాటాలు చేయాలని సీతక్క కోరారు. అన్యాయం, అక్రమాలను నిలదీసి ప్రజా  గొంతుకగా చైతన్యాన్ని అందరూ అందిపుచ్చుకుని పేదలకు అండగా నిలబడాలని అన్నారు. స్వర్గీయ రామదాసు  వెంకట సుబ్బమ్మ ల సేవలు చిరస్మరణీయం అని కొనియాడారు. ఆస్తులు సంపాదించడం కన్నా మనుషుల మనసుల్ని గెలవడం మిన్న అని  ఉన్నతమైన వ్యక్తులు ఎప్పుడు ఉన్నతంగా ఉంటారని అందుకే వారు స్వర్గీయులైన విగ్రహాలుగా అందరి మనసుల్లో సజీవంగా ఉన్నారని అన్నారు. వారి జ్ఞాపకార్ధంగా చనిపోయిన వారికోసం మహాప్రస్థానం ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాంనాయక్, జెట్టి సోమయ్య, కొంపెళ్లి శ్రీనివాస్ రెడ్డి, సూదిరెడ్డి జనార్దన్ రెడ్డి, సర్పంచ్ లావుడియా లక్ష్మీ- జోగ నాయక్, గ్రామ అధ్యక్షుడు రామచంద్రపు వెంకటేశ్వర్లు (ఆర్వీ), సింగపురం కృష్ణ, గ్రామ యూత్ కమిటీ అధ్యక్షుడు మద్దినేని వినయ్, మారపాకల సతీష్, ఇరుసవడ్ల నవీన్, సన్నగుండ్ల సారయ్య, మందడి సంపత్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఈవీఎం ల తనిఖీ

Bhavani

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ కారు ధ్వంసం

Sub Editor

“అమ్ముంటే చాలంటూ…..”

Satyam NEWS

Leave a Comment