34.7 C
Hyderabad
May 5, 2024 00: 01 AM
Slider హైదరాబాద్

రంజాన్ తోఫా వితరణ ప్రారంభించిన ఎమ్మెల్యే మాగంటి

#Ramjan Tofa

హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తన సొంత ఖర్చుతో ఏర్పాటు చేసిన రంజాన్ తోఫా పంపిణీని నేడు ప్రారంభించారు. యూసుఫ్ గూడ డివిజన్ లోని ఎల్ ఎన్ నగర్ లో నిరుపేద ముస్లిం సోదరులకు రంజాన్ పండగ బహుమతిని ఆయన అందచేశారు.

జూబ్లీ హిల్స్ నియోజకవర్గం వ్యాప్తంగా దాదాపు పది వేల మంది నిరుపేద ముస్లింలకు రంజాన్ గిఫ్ట్ ఇవ్వాలని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆ ప్రకారం ఆయన గిఫ్ట్ లను సిద్ధం చేయించారు. ఈ గిఫ్ట్ లో నిత్యావసర వస్తువులతో బాటు సేమ్యా, డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయి.

రంజాన్ గిఫ్ట్ పంపిణీ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో పేదల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడుతున్నారని, అందులో భాగంగానే తాను ముస్లింలకు రంజాన్ తోఫా అందచేస్తున్నానని అన్నారు.

కరోనా లాక్ డౌన్ కారణంగా రంజాన్ పండుగను అందరితో కలిసి చేసుకోలేకపోయినా ఇంటి వద్దనే అందరూ జరుపుకునే విధంగా ఈ గిఫ్ట్ ను రూపొందించామని ఆయన తెలిపారు. అందరూ ఇంటిలోనే ఉండి రంజాన్ పండుగను జరుపుకోవాలని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పిలుపునిచ్చారు.

ఏ పండుగ వచ్చినా హిందూ ముస్లింలు కలిసి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎవరూ రోడ్లపైకి రాకుండా ఇంట్లోనే ఉండి కుటుంబ సభ్యుల మధ్య రంజాన్ పండుగ జరుపుకోవాలని ఆయన కోరారు.

Related posts

పంటకు నీరివ్వలేని ఎమ్మెల్యే అవసరమా?

Satyam NEWS

చికిత్స పొందుతూ పులికల్ దేవన్న మృతి

Bhavani

కృష్ణా నది ఒడ్డున 24 గంటల పోలీసు పహారా

Satyam NEWS

Leave a Comment