38.2 C
Hyderabad
April 27, 2024 16: 08 PM
Slider మహబూబ్ నగర్

కృష్ణా నది ఒడ్డున 24 గంటల పోలీసు పహారా

CI Kollapur 191

కొల్లాపూర్ కి ఆనుకొని ఉన్న కర్నూల్ జిల్లాలో కరోనా వైరస్ కేసులు ఎక్కువ నమోదు అవుతున్నందున కృష్ణానది ఒడ్డున పూర్తి స్థాయి పహారాకు పోలీసు పికెట్ లు ఏర్పాటు చేశామని కొల్లాపూర్ సిఐ బి.వెంకట్ రెడ్డి తెలిపారు. నాగర్ కర్నూల్ ఎస్ పి సాయి శేఖర్ ఆదేశాల మేరకు సోమశిల, అమరగిరి,  మల్లేశ్వరం, మంచాల కట్ట గ్రామాలలో కృష్ణా నది ఒడ్డున పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

24 గంటలూ పోలీస్ వారు అక్కడే ఉండి  గస్తీ తిరుగుతుంటారని ఆయన తెలిపారు. అందువల్ల ఎవరూ కూడా బోట్లలో కానీ పుట్టీలలో కానీ ప్రయాణివద్దని సిఐ వెంకట్ రెడ్డి తెలిపారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి ప్రయాణం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఆవిధంగా ప్రయాణించిన బోటులను, పుట్టిలను స్వాధీనం చేసుకుంటామని కూడా సిఐ బి.వెంకట్ రెడ్డి తెలిపారు.

Related posts

ఈశ్వరిపురి కాలనీ  సంక్షేమ సంఘం నూతన కమిటి ఎన్నిక

Satyam NEWS

ములుగు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక

Satyam NEWS

డీజీపీ ఆదేశాల‌తో పీఎస్ ల‌లో మార‌నున్న రిసెప్ష‌న్ కౌంట‌ర్లు..!

Satyam NEWS

Leave a Comment