మలితరం తెలంగాణ ఉద్యమకారుడు నడిగడ్డ ముద్దుబిడ్డ ఐజ మండలం పులికల్ గ్రామానికి చెందిన దేవన్న (53) మూడు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కర్నూల్లోని సంజీవిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ
గురువారం మధ్యాహ్నం మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దేవన్నకు భార్య ఆరుగురు ఆడపిల్లలు ఉన్నారని వారిలో 5 మంది పిల్లలకు వివాహం చేయగా ఇంకొక కుమార్తె వివాహానికి ఉన్నట్లు తెలిసింది. దేవన్నకు మెరుగైన వైద్యం అందించేందుకు ఆసుపత్రి వర్గాలు ఎంతగానో కృషి చేసిన ఫలితం లేకపోయింది.